కర్నూలులో డేంజర్ బెల్స్.. వైద్యుడి కుటుంబంలో ఆరుగురికి కరోనా

Six members in a Doctors family infected to corona virus
  • ఇటీవల కరోనాతో మరణించిన ప్రైవేటు వైద్యుడు 
  • కర్నూలు పట్టణంలో 24 గంటల్లో 13 కేసులు
  • మొత్తం కేసుల్లో 44 శాతం గుంటూరు, కర్నూలులోనే 
కర్నూలులో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల మధ్య పట్టణంలో 13 కేసులు నమోదు కాగా, వీటిలో ఆరు కేసులు ఇటీవల కరోనాతో మరణించిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడి కుటుంబ సభ్యులవే కావడం గమనార్హం. అలాగే, కర్నూలు సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలికి వైరస్ సోకినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రం మొత్తం కేసుల్లో 44 శాతం వరకు గుంటూరు, కర్నూలు జిల్లాలలోనే నమోదు కావడం గమనార్హం.

Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Guntur District
Kurnool District

More Telugu News