ఉక్కు సంకల్పంతో క‌రోనాను జయించిన న్యూజిలాండ్‌.. చిట్టచివరి కరోనా రోగి డిశ్చార్జ్‌

no corona virus cases in newzealand
  • ప్రకటించిన న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్
  • ఆంక్షల సడలింపుపై సమాలోచనలు
  • లాక్‌డౌన్‌ను  కఠినంగా అమలుచేసిన న్యూజిలాండ్
  • మాంద్యంలోకి కూరుకుపోయినప్పటికీ కరోనా నియంత్రణపైనే దృష్టి
కరోనాను అరికట్టడానికి ప్రపంచ దేశాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ విషయంలో చైనా మినహా ఏ దేశానికి దక్కని ఘనత న్యూజిలాండ్‌కు దక్కింది. తమ దేశంలో నమోదైన చిట్టచివరి కరోనా వైరస్‌ బాధిత మహిళ కోలుకుందని ఆ దేశ ప్రధాని  జసిండా అర్డెర్న్ ప్రకటన చేశారు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చెందిన ఆ క‌రోనా బాధిత మ‌హిళ సెయింట్ మార్గరెట్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావడంతో ఇప్పుడు ఆ దేశంలో ఒక్క కరోనా యాక్టివ్ కేసు కూడా లేదు.

దీంతో న్యూజిలాండ్‌లో ఆంక్షల  సడలింపును ప్రకటించవచ్చ‌ని తెలుస్తోంది. న్యూజిలాండ్‌ నుంచి కరోనాను తరిమికొట్టినప్పటికీ పలు జాగ్రత్తలు తీసుకుంటామని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. న్యూజిలాండ్‌లో లాక్‌డౌన్‌ను  కఠినంగా అమలుచేశారు. అత్యవసర, నిత్యావసరాలకు మాత్రమే బయటకు రావాలని, అదీ పూర్తి జాగ్రత్తలు పాటించాలని కోరారు.

న్యూజిలాండ్‌ ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయినప్పటికీ ఆ దేశ ప్రధాని కరోనా వైరస్‌ను తరిమేయడమే ముఖ్యమని భావించారు. కరోనాను అరికట్టాక మళ్లీ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిద్దామని ఆమె అన్నారు. ఉక్కు సంకల్పంతో కరోనాను జయించిన న్యూజిలాండ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Go Back to Shorts
newzealand
Corona Virus
COVID-19

More Telugu News