బ్యాంకుల అండతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex closes 288 points high
  • 288 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 82 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 4 శాతానికి పైగా పుంజుకున్న ఇండస్ ఇండ్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకుల అండతో ఈరోజు మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 288 పాయింట్లు లాభపడి 39,044కు పెరిగింది. నిఫ్టీ 82 పాయింట్లు పుంజుకుని 11,522 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.03%), భారతి ఎయిర్ టెల్ (2.33%), యాక్సిస్ బ్యాంక్ (2.17%), బజాజ్ ఫైనాన్స్ (2.15%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.14%).

టాప్ లూజర్స్:
టైటాన్ కంపెనీ (-1.20%), మారుతి సుజుకి (-1.02%), ఐటీసీ (-0.85%), ఏసియన్ పెయింట్స్ (-0.67%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.35%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News