అమరావతి రైతులు, మహిళలతో సమావేశం కానున్న పవన్ కల్యాణ్

pawan to meet amaravati farmers
  • గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన నేతలతోనూ భేటీ
  • ఈ రోజు, రేపు పవన్ బిజీ
  • జనసేనను బలోపేతం చేయడంపై దృష్టి
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ రోజు, రేపు ఆయన జనసేన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగానే ఆయన అమరావతి రైతులు, మహిళలతోనూ సమావేశం కానున్నారు.

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలల పాటు ఫాంహౌస్‌లోనే అధిక సమయాన్ని గడిపిన పవన్.. ఇటీవలే వకీల్ సాబ్ షూటింగులో కూడా పాల్గొన్నారు. ఆ మధ్య పలుసార్లు ఆన్ లైన్‌ ద్వారా పార్టీ సమావేశాలు నిర్వహించారు. గుంటూరులో తమ పార్టీ నేతలతో చర్చించి ఏపీలో జనసేనను బలోపేతం చేయడం పట్ల ఆయన సూచనలు ఇస్తారని తెలుస్తోంది.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Amaravati

More Telugu News