బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

lovers commit suicide
  • మహబూబాబాద్‌ జిల్లాలోని గార్ల మండలంలో ఘటన
  • పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలనుకున్న జంట
  • వారి ప్రేమకు పెద్దలు అడ్డు
  • మనస్తాపం చెంది ఆత్మహత్య  
వారిద్దరు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. అయితే, వారి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పారు. దీంతో పెద్దలను ఎదిరించి జీవించలేక, ఒకరినొకరు విడిచి ఉండలేక తనువు చాలించారు. ఈ విషాద ఘటన మహబూబాబాద్‌ జిల్లాలోని  గార్ల మండలం రాజుతండ పరిధిలోని వడ్ల తండ శివారులో చోటు చేసుకుంది.

అక్కడి ఓ బావిలో ఓ జంట మృతదేహాలు కనపడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ అబ్బాయి, అమ్మాయిని గుగులోత్‌ ప్రశాంత్‌, భూక్య ప్రవీణగా పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు తెలుసుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
Go Back to Shorts
suicide
Mahabubabad District
lovers

More Telugu News