ఏపీలో ఐపీఎస్ ల బదిలీలు.. పీఎస్ఆర్‌కు ఇంటెలిజెన్స్‌.. రాజేంద్ర‌నాథ్ రెడ్డికి ఏసీబీ

psr anjaneyulu is the new ap intelligence chief
  • ఏపీలో ముగ్గురు ఐపీఎస్‌లకు కీల‌క పోస్టింగ్‌లు
  • విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా భ‌ర‌త్‌
  • ఐఏఎస్ బ‌దిలీల‌తో పాటే ఐపీఎస్‌ల బ‌దిలీలు
ఏపీలో ఐఏఎస్ అధికారులతో పాటే ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా బ‌దిలీ అయ్యారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. ఇంటెలిజెన్స్ డీజీగా సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి పి.సీతారామాంజ‌నేయులు నియ‌మితుల‌య్యారు. ఇక ఏసీబీ డీజీగా మ‌రో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి రాజేంద్ర‌నాథ్ రెడ్డి నియ‌మితుల‌య్యారు. ఇంకో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి భ‌ర‌త్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా నియ‌మిస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.
Go Back to Shorts
ips transfers
psr anjaneyulu

More Telugu News