ర‌ఘురామ‌కృష్ణరాజుపై ప‌రువు న‌ష్టం దావా.. ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం!

ap government decides to file defamation suit against mp raghuramakrishna raju
  • ఏపీలో దొరికే మ‌ద్యం హానికరమన్న ర‌ఘురామ‌
  • చెన్నైలోని ఓ ల్యాబ్‌లో ప‌రీక్ష‌లు చేయించిన వైనం
  • తాజాగా ప్ర‌భుత్వానికి అందిన నివేదిక‌
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై ప‌రువు న‌ష్టం దావా వేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌జత్ భార్గ‌వ మంగ‌ళ‌వారం నాడు ఓ ప్ర‌కట‌న విడుద‌ల చేశారు. ప్ర‌భుత్వంపై ర‌ఘురామ‌కృష్ణరాజు ఉద్దేశ‌పూర్వ‌కంగా ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న ఆ ప్ర‌క‌ట‌న‌లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ఏపీలో దొరుకుతున్న మ‌ద్యంలో హానిక‌ర ర‌సాయ‌నాలున్నాయని ఆరోపించిన ర‌ఘురామ‌రాజు ఆ మ‌ద్యం శాంపిళ్ల‌ను చెన్నైలోని ఎస్‌జీఎస్ ల్యాబ్‌లో ప‌రీక్ష‌లు జ‌రిపించారు. ఆ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన నివేదిక తాజాగా ప్ర‌భుత్వానికి అందింది. ఈ నివేదిక ప్ర‌కారం ఏపీలో దొరుకుతున్న మ‌ద్యంలో ఎలాంటి హానిక‌ర ర‌సాయ‌నాలున్నాయని తేలలేద‌ని ర‌జ‌త్ భార్గ‌వ తెలిపారు. ప్ర‌భుత్వంపై ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న ర‌ఘురామరాజుపై ప‌రువు న‌ష్టం దావా వేయ‌నున్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌క‌టించారు.
Go Back to Shorts
Raghu Rama Krishna Raju
Andhra Pradesh
Defamation Suit

More Telugu News