'రాధే శ్యామ్' అలా కొంతవరకూ ఆదుకుందట!

Radhe Shyam movie update
  • మార్చి 11న వచ్చిన 'రాధేశ్యామ్'
  • అంచనాలను అందుకోలేకపోయిన ప్రేమకథ
  • భారీ స్థాయిలో వచ్చిన నష్టాలు 
  • ఊరటనిచ్చిన డిజిటల్ ఫ్లాట్ ఫామ్ 
ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్' మార్చి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వంశీ .. ప్రమోద్. ప్రసీద కలిసి నిర్మించిన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇటలీ నేపథ్యంలో నడిచే ఈ ప్రేమకథ కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. భారీ అంచనాల మధ్య దీనిని విడుదల చేశారు.

అయితే అభిమానుల అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. భారీ మొత్తంలోనే నష్టాలు వచ్చినట్టుగా ప్రచారం జరిగింది. ప్రభాస్ తన పారితోషికాన్ని వదులుకున్నాడనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో నెల రోజుల లోగానే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో వచ్చింది. దాంతో ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయిన వాళ్లంతా ఇప్పుడు చూస్తున్నారు. 

'రాధేశ్యామ్' థియేట్రికల్ హక్కుల వలన నష్టపోయిన నిర్మాతలకు, డిజిటల్ హక్కుల వలన భారీ ఆదాయం చేకూరింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మరి కొంతకాలం తరువాత ఈ సినిమా స్ట్రీమింగ్ కావాలి. కానీ ముందుగానే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడం కోసం అమెజాన్ ప్రైమ్ వారు అదనంగా మరో 25 కోట్లను చెల్లించారట. ఒకరకంగా ఇది నిర్మాతలకు ఊరటనిచ్చే విషయమని చెప్పుకోవచ్చు.
Go Back to Shorts
Prabhas
Pooja Hegde
Radhakrishna Kumar
Radhe Shyam Movie

More Telugu News