దూసుకుపోయిన మార్కెట్లు.. 17 వేలు దాటిన నిఫ్టీ!

Markets ends in profits
  • 702 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 207 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 4.5 శాతం పెరిగిన హిందుస్థాన్ యూనిలీవర్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాల ప్రభావంతో మార్కెట్లు రాణించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 702 పాయింట్లు లాభపడి 57,521కి చేరుకుంది. నిఫ్టీ 207 పాయింట్లు పెరిగి 17,245కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (4.55%), ఏసియన్ పెయింట్స్ (3.18%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.79%), ఎన్టీపీసీ (2.67%), ఎల్ అండ్ టీ (2.58%). 

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-0.84%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.54%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.31%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.12%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News