గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్న కేసీఆర్

CM KCR areal survey in Godavari flood affected areas
  • గోదావరి వరద నీటితో జలమయమైన వందలాది గ్రామాలు
  • సీఎస్ సోమేష్ కుమార్ తో కలిసి ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే 
  • కడెం నుంచి భద్రాచలం వరకు ఏరియల్ సర్వే
భారీ వర్షాలతో గోదావరి పోటెత్తిన సంగతి తెలిసిందే. వరద నీటితో వందలాది గ్రామాలను గోదావరి ముంచెత్తింది. గోదావరి వరదల కారణంగా అపారమైన నష్టం వాటిల్లింది. వరద ఇంకా తగ్గకపోవడంతో ఎంత నష్టం జరిగిందనే విషయాన్ని ఇంకా కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. 

మరోవైపు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కలిసి వరద బీభత్సాన్ని పరిశీలించనున్నారు. కడెం నుంచి భద్రాచలం వరకు వీరిద్దరూ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించబోతున్నారు. 

మరోవైపు వరదల వల్ల అంటు వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులకు సీఎం ఆదేశాలను జారీ చేశారు. కేసీఆర్ ఆదేశాలతో గోదావరి వరద బాధిత ప్రాంతాల్లోని వైద్యాధికారులు, వైద్యులతో ఆరోగ్య మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు, కేసీఆర్ ఏరియల్ సర్వేకు సంబంధించి భద్రతాపరమైన అంశాలను సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Go Back to Shorts
KCR
TRS
Godavari Floods
Areal Survey

More Telugu News