చంద్రబాబు గారూ! కేసును మీరే మరింత జటిలం చేసుకున్నారు: విజయసాయిరెడ్డి

Vijayasaireddy says chandrababu facing much trouble with his petitions
  • ఏ నేరం చేయలేదని బుకాయిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేయించారన్న విజయసాయిరెడ్డి
  • కానీ ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే కోర్టు రిమాండ్ విధించిందని వెల్లడి
  • క్వాష్ పిటిషన్ వేసి హైకోర్టుతో అక్షింతలు వేయించుకున్నారని విమర్శలు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై కేంద్రకారాగారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తప్పు చేస్తున్నారంటూ వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. చంద్రబాబు లక్ష్యంగా ఆయన ఎప్పటికప్పుడు ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా మరోసారి ఓ ట్వీట్ చేశారు.

చంద్రబాబు గారు కేసును తప్పుదోవ పట్టించి మరింత జటిలం చేసుకున్నారని పేర్కొన్నారు. ఏ నేరం చేయలేదని బుకాయిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేయించారని, కానీ ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే కోర్టు రిమాండు విధించిందన్న విషయాన్ని లెక్క చేయకుండా మెయింటెయినబుల్ కాని క్వాష్ పిటీషనుతో హైకోర్టుతో అక్షింతలు వేయించుకున్నారన్నారు.
Go Back to Shorts
Vijayasai Reddy
Andhra Pradesh
Telugudesam

More Telugu News