శ్రీశైలంలో రుద్రాభిషేకం జరిపించిన చంద్రబాబు, భువనేశ్వరి

Chandrababu and Bhuvaneswari performs Rudrabhishekam in Srisailam
  • శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన చంద్రబాబు దంపతులు
  • భ్రమరాంబికా మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు
  • సాక్షి గణపతి, వీరభద్రస్వామి వార్లకు పూజలు
టీడీపీ అధినేత చంద్రబాబు తన అర్ధాంగి నారా భువనేశ్వరి సమేతంగా ఇవాళ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ఇక్కడి భ్రమరాంబికా మల్లికార్జునస్వామివారిని దర్శించుకున్నారు. మహాశివుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, భువనేశ్వరిలకు వేదపండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ పర్యటనలో చంద్రబాబు, భువనేశ్వరి ఇక్కడి సాక్షి గణపతి, వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు రాకతో శ్రీశైలం టీడీపీ శ్రేణుల్లో కోలాహలం నెలకొంది.
Go Back to Shorts
Chandrababu
Nara Bhuvaneswari
Srisailam
TDP
Andhra Pradesh

More Telugu News