కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలకు మూడ్రోజులపాటు బ్రేక్

Three days break for KCR meetings
  • అధినేతకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించిన బీఆర్ఎస్
  • ఆత్మీయ సమావేశాల పునఃప్రారంభం ఎప్పుడో త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడి
  • పక్షం రోజులుగా వేలాదిమందిని కలిసిన కేసీఆర్
బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో పదిహేను రోజులుగా కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్నాయి. అయితే, వీటికి మూడు రోజుల పాటు బ్రేక్ ఇచ్చి... అధినేతకు విశ్రాంతి ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్‌తో చర్చించి పార్టీ ముఖ్య నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఆత్మీయ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యేది ఎప్పుడు? ఏ నియోజకవర్గాల వారు ఎప్పుడు రావాలి? అనే విషయాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.

లోక్ సభ ఎన్నికల తర్వాత, పలు దఫాలుగా పార్టీ కార్యకర్తలు, నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో గత రెండు వారాలుగా నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు, నేతలను భేటీ అవుతున్నారు. తనను కలిసేందుకు ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వస్తున్న వారిని కలుస్తున్నారు. 15 రోజుల్లో వేలాదిమందిని ఆయన కలిశారు.
Go Back to Shorts
KCR
BRS
Telangana

More Telugu News