ఏకంగా రూ.130 కోట్ల విరాళం... అతి పెద్ద కార్పొరేట్ విరాళాల్లో ఇది కూడా ఒకటి!

motilal oswal foundation donations to iit bombay
  • బాంబే ఐఐటీకి రూ.130 కోట్ల విరాళాన్ని అందించిన మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్
  • విద్యాసంస్థలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్‌ను మరింతగా మెరుగుపర్చేందుకు ఈ ఆర్ధిక సహకారం అందిస్తున్నట్లు ప్రకటన 
  • ఈక్విటీల్లో పది శాతం దాతృత్వం కోసం ఇస్తామని ప్రతిజ్ఞ చేసిన మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్
ప్రముఖ ఫండ్ మేనేజ్‌మెంట్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ అతి పెద్ద కార్పొరేట్ విరాళాన్ని అందించింది. ఈ ఫౌండేషన్ ఏకంగా రూ.130 కోట్ల విరాళాన్ని ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థ బాంబే ఐఐటీకి అందించింది. ఈ విద్యాసంస్థలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ ను మరింతగా మెరుగుపర్చేందుకు ఆర్ధిక సహకారం అందిస్తున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ తెలిపింది. అత్యాధునిక విద్య సంబంధిత మౌలిక వసతుల ఏర్పాటు, ఫైనాన్షియల్ మార్కెట్ లో వినూత్న కార్యక్రమాల ఆవిష్కరణే లక్ష్యంగా ఈ సాయాన్ని అందించింది. 
 
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎంఒఎఫ్ఎస్ఎల్) రూ.4000 కోట్ల ఈక్విటీల్లో పది శాతం దాతృత్వం కోసం ఇస్తామని ఇంతకు ముందు ప్రతిజ్ఞ చేసింది. ఆ ప్రకారం ఈ మొత్తాన్ని అందజేయడం విశేషం. ఐఐటీ బాంబేలో మోతీలాల్ ఓస్వాల్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటునకు ఇది తోడ్పడనుంది.
 
తమ విద్యాసంస్థకు పెద్ద మొత్తంలో విరాళం అందించిన మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ కు ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీశ్ కెదారె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ ట్రస్టీ మోతీలాల్ ఓస్వాల్ మాట్లాడుతూ .. మోతీలాల్ ఓస్వాల్ నాలెడ్జ్ సెంటర్, సెంటర్ ఫర్ క్యాపిటల్ మార్కెట్స్ వ్యూహాత్మక దాతృత్వ శక్తికి నిదర్శనంగా ఉంటాయన్నారు.
Go Back to Shorts
motilal oswal foundation
IIT Bombay
Business News

More Telugu News