రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తుమ్మల నాగేశ్వరరావు
- 22న రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్టు తెలిపిన తుమ్మల
- 70 లక్షల మంది ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయని వెల్లడి
- రేపు నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభిస్తారన్న మంత్రి
రైతులకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపి కబురు అందించారు. ఈ నెల 22వ తేదీన సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ విడుదల చేయనున్నారని ఆయన వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు సంక్షేమం ఆగకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని ఆయన అన్నారు.