కేసీఆర్‌ను కలిసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్!

  • 6.30కి ప్రగతి భవన్‌కు పవన్ కల్యాణ్
  • ఆ సమయంలో రాజ్‌భవన్‌లో ఉన్న కేసీఆర్
  • సుమారు 7.30కి కేసీఆర్‌తో పవన్ భేటీ
జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా క‌లిశారు. కేసీఆర్‌కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొద్దిసేపు కేసీఆర్‌తో పలు అంశాలపై చర్చించారు.

కాగా, ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు పవన్ కల్యాణ్ సాయంత్రం 6.30కి వెళ్లారు. అయితే, ఆ సమయంలో ముఖ్య‌మంత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ వద్ద ఉన్నారు. దీంతో పవన్ ప్రగతి భవన్‌ను సందర్శించారు. అనంతరం సుమారు 7.30కు కేసీఆర్ ప్రగతి భవన్‌కు వచ్చినట్లు సమాచారం. 
Go Back to Shorts
Pawan Kalyan
KCR
Hyderabad

More Telugu News