కథువా దారుణంపై స్పందించిన ఐక్యరాజ్య సమితి

  • ఇది భయానక ఘటన
  • ఈ దారుణానికి పాల్పడ్డ వారిని ఉరి తీయాలి
  • అటువంటి వారిని క్షమించకూడదు
  • మరోసారి ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకూడదు
జమ్ముకశ్మీర్‌లోని కథువా ప్రాంతంలో ఓ గుడిలో కొందరు మృగాళ్లు చిన్నారిపై అత్యాచారం చేసి గొంతునులిమి చంపేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి కూడా స్పందించి దీన్ని భయానక ఘటనగా అభివర్ణించింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ దారుణ ఘటనపై మాట్లాడుతూ... ఆ చిన్నారిపై ఇటువంటి దారుణానికి పాల్పడ్డ వారిని ఉరి తీయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. మీడియాలో వచ్చిన కథనాలు తనను కదిలించాయని, ఓ పసి ప్రాణాన్ని అతి భయంకరంగా హింసించి, హత్య చేశారని, అటువంటి వారిని క్షమించకూడదని అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకూడదని తాను కోరుకుంటున్నానని అన్నారు.
Go Back to Shorts
Jammu And Kashmir
rape
uno

More Telugu News