శ్రీకాకుళం మాజీ ఎస్పీ అడపా వెంకటరత్నంకు మళ్లీ పోస్టింగ్
- ఎన్నికల సమయంలో అడపా వెంకటరత్నం బదిలీ
- తిరిగి పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం
- ఏపీ ట్రాన్స్ కో చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ ఆఫీసర్ గా నియామకం
శ్రీకాకుళం ఎస్పీగా ఉన్న అడపా వెంకటరత్నంను ఎన్నికల సమయంలో ఏపీ ట్రాన్స్ కోకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, వెంకటరత్నంకు పోస్టింగ్ భించింది. ఏపీ ట్రాన్స్ కో చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఆయన్ని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, తనను బదిలీ చేయడంపై ఈసీకి వెంకటరత్నం ఇటీవలే ఓ లేఖ రాశారు. ఎన్నికలు ముగియడంతో తిరిగి ఆయనకు పోస్టింగ్ లభించింది.