షీ టీమ్స్ తరహాలో ఏపీలో శక్తి టీమ్స్.. విశాఖలో ప్రారంభించిన డీజీపీ ఠాకూర్

  • మహిళా పోలీస్ దళం ఏర్పాటు
  • 5 కార్లు, 26 హోండా యాక్టివాలు కేటాయింపు
  • డ్రగ్స్ భూతంపై ఉక్కుపాదం



తెలంగాణలో కొన్నాళ్ల కిందట 'షీ' టీమ్స్ పేరిట ఏర్పాటైన మహిళా పోలీస్ దళాలు బాగా విజయవంతమయ్యాయి. ఇప్పుడదే కోవలో ఏపీలోనూ మహిళలతో పోలీస్ దళాలు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నంలో 'శక్తి' టీమ్స్ పేరిట ఏర్పాటైన మహిళా పోలీస్ దళాలను రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఇవాళ ప్రారంభించారు. ఈ 'శక్తి' టీమ్ కార్యకలాపాల కోసం 5 కార్లు, 26 హోండా యాక్టివాలు కేటాయించారు.

విశాఖలో ఇటీవల రేవ్ పార్టీ జరిగిన నేపథ్యంలో డ్రగ్స్ మాఫియా తెరపైకి రావడం తనను కలచివేసిందని డీజీపీ ఠాకూర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫిర్యాదులు, సమాచారం కోసం ప్రత్యేకంగా ఫోన్ నంబర్ ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

Police
Andhra Pradesh
Vizag

More Telugu News