అమరావతి యువకుల 151 గంటల దీక్ష పూర్తి.. నిమ్మరసం ఇచ్చిన నారా లోకేశ్

  • దీక్ష చేసిన ఇద్దరు యువకులు రవిచంద్ర, శ్రీకర్
  • వెలగపూడి వేదికగా 151 గంటల దీక్ష
  • సంబంధిత ఫొటోలను పోస్ట్ చేసిన లోకేశ్
రాజధాని అమరావతిని తరలించ వద్దంటూ వెలగపూడికి చెందిన ఇద్దరు యువకులు రవిచంద్ర, శ్రీకర్ 151 గంటల దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్ష ఈరోజుతో పూర్తయింది. ఈ సందర్భంగా ఆ యువకులకు నిమ్మరసం ఇచ్చి వారి దీక్షను టీడీపీ నేత నారా లోకేశ్ విరమింపజేశారు. ఈ విషయాన్ని లోకేశ్ ఓ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.

కాగా, అమరావతిని తరలించవద్దని కోరుతూ 151 గంటలే నిరాహార దీక్ష చేయడం వెనుక గల కారణాన్ని వారు వివరించారు. వైసీపీ ఎమ్మెల్యేలు 151 మందికి బుద్ధి రావాలని కోరుకుంటూ ఒక్కో ఎమ్మెల్యేకు ఒక్కో గంట చొప్పున కేటాయిస్తూ ఈ దీక్ష చేపట్టినట్టు చెప్పారు.

Nara Lokesh
Velagapudi
Two Youth
Hunger strike

More Telugu News