ఈశాన్య భారతాన్ని తాకిన కరోనా.. మణిపూర్​ లో తొలి కేసు

first confirmed case of infection reported from North East India is in manipur
  • ఇంపాల్‌లో 23 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌
  • ఇటీవల యూకే వెళ్లొచ్చినట్టు గుర్తింపు
  • దేశంలో 500 దాటిన కరోనా కేసులు
కరోనా మహమ్మారి దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. ఈశాన్య భారతానికి కూడా ఈ ప్రాణాంతక వైరస్ పాకింది. మణిపూర్ రాష్ట్రంలో కరోనా తొలి కేసు నమోదైంది. ఉత్తర ఇంపాల్‌కు చెందిన 23 ఏళ్ల వ్యక్తికి వైరస్‌ సోకినట్టు మంగళవారం నిర్ధారించారు.ఇటీవల యూకే వెళ్లొచ్చిన  ఆ వ్యక్తికి చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.

దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 500 దాటింది. కర్ణాటకలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా నాలుగు కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో మొత్తంగా 37 మంది వైరస్ బారిన పడ్డారు. మరోవైపు మహారాష్ట్ర అత్యధికంగా ప్రభావితం అవుతోంది. దేశంలోనే అత్యధికంగా ఆ రాష్ట్రంలో 97 మందికి వైరస్‌ సోకింది. సోమవారం ఒక్క రోజే 23 కొత్త కేసులు వచ్చాయి. కేరళ 95 కేసులతో రెండో స్థానంలో ఉంది.
Go Back to Shorts
manipur
first
Corona Virus
case
north east india

More Telugu News