ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర పర్యావరణ శాఖ

  • ఉత్పత్తుల ప్రారంభానికి అనుమతి ఇవ్వలేదని స్పష్టీకరణ
  • రెండేళ్ల కిందటే అనుమతి నిరాకరించినట్టు వెల్లడి
  • విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఘటనపై కేంద్ర పర్యావరణ శాఖ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పరిశ్రమలో ఉత్పత్తుల ప్రారంభానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని అఫిడవిట్ లో పేర్కొంది. రెండేళ్ల క్రితమే అనుమతి నిరాకరించామని వెల్లడించింది. దీనిపై స్పందించిన హైకోర్టు, మిగతా ప్రతివాదులు కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

Centre
LG Polymers
AP High Court
Vizag Gas Leak
Vizag

More Telugu News