మన బంధం శాశ్వతమని మనిద్దరికీ తెలుసు: అనసూయ

  • శశాంక్, అనసూయల పెళ్లికి పదేళ్లు
  • భావోద్వేగ పోస్టును పెట్టిన అనసూయ
  • నీతో కలిసి బతకడం మాత్రమే నాకు తెలుసంటూ వ్యాఖ్య
తెలుగు యాంకర్, సినీ నటి అనసూయ.. శశాంక్ భరద్వాజ్ ను పెళ్లి చేసుకుని 10 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆమె తన భర్తను ఉద్దేశించి ఓ క్యూట్ మెసేజ్ ను పోస్ట్ చేసింది. తన బలం, తన మానసిక స్థైర్యం, తన గందరగోళం అన్నీ నీవే అని పేర్కొంది.

'ప్రతిసారి మనం పోట్లాడుకుంటాం. నీతో ఎప్పటికీ మాట్లాడకూడదు అని అనుకుంటా. అయితే నేనొక ఫూల్ ను. నాకు నీతో కలిసి బతకడం మాత్రమే తెలుసు. అంతకు మించి నాకు మరేం తెలియదు. మన బంధం శాశ్వతమని మనిద్దరికీ తెలుసు. ఇన్ఫినిటీ స్టోన్స్ ను థానోస్ ప్రేమించినంత గొప్పగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. మెంటల్... ' అంటూ భర్తపై తనకున్న ప్రేమాభిమానాలను వ్యక్తపరిచింది.

Anasuya
Marriage
Tollywood

More Telugu News