ఈ జాబితాలో మన రాష్ట్రం ఎందుకు మిస్సయింది?: చంద్రబాబు

  • కరోనా పరీక్షలపై కేంద్రం జాబితా
  • కనిపించని ఏపీ పేరు
  • ప్రజలను మోసం చేస్తున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం
ఏపీలో కరోనా టెస్టుల తీరుతెన్నులపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రతి 10 లక్షల మంది జనాభాలో 140 కంటే ఎక్కువ టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం పేరు ఎందుకు కనిపించడం లేదంటూ ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన జాబితాలో ఏపీ పేరు ఎందుకు మిస్సైందని నిలదీశారు. ఏపీ ప్రజలని తప్పుడు సంఖ్యలతో ఎందుకు మోసం చేస్తున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. అంతేకాదు, కేంద్రం విడుదల చేసిన గ్రాఫ్ ను కూడా పంచుకున్నారు.


Chandrababu
Andhra Pradesh
Centre
Corona Virus
Tests

More Telugu News