బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం... చెన్నైకి ఆగ్నేయంగా కేంద్రీకృతం

  • చెన్నైకి ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం
  • ఈ నెల 25న తీరం దాటే అవకాశం
  • ఏపీకి వర్ష సూచన
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. కాగా, ఈ వాయుగుండం తుపానుగా మారితే ఇరాన్ ప్రతిపాదించిన మేరకు 'నివర్' అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ వాయుగుండం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశలో 550 కిమీ దూరంలోనూ, చెన్నైకి ఆగ్నేయంగా 590 కిమీ దూరంలోనూ కేంద్రీకృతమై ఉందని ఐఎండీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇది క్రమేపీ వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 25 మధ్యాహ్నం కారైక్కాల్, మామల్లపురం వద్ద తీరం దాటనుంది. దీని ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

Depression
Bay Of Bengal
Cyclone
Nivar
Tamilnadu
Andhra Pradesh

More Telugu News