పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో డీఎంకే జెండా ఊపిన నేత

  • పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు
  • కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల పంపకం చర్చలు
  • తనకు సీటు దక్కదేమోనని భావించిన కాంగ్రెస్ నేత వెంకటేశన్
  • పుదుచ్చేరిలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం
  • డీఎంకే జెండా చేతబూని సమావేశానికి వచ్చిన వైనం
  • రసాభాసగా మారిన సమావేశం
పుదుచ్చేరి ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై చర్చ జరిగిన నేపథ్యంలో తనకు టికెట్ దక్కుతుందో, దక్కదో అని భావించిన కాంగ్రెస్ నేత వెంకటేశన్ పార్టీ సమావేశంలో డీఎంకే జెండా ఊపడం కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ ఘటన జరిగింది. దాంతో ఆ సమావేశం కాస్తా రసాభాస అయింది.

వెంకటేశన్ ను అడ్డుకునేందుకు ఓ నాయకుడు ప్రయత్నించగా, అది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఎన్నికలపై చర్చించడానికి నిర్వహించిన ఆ సమావేశం బాహాబాహీకి వేదికగా మారింది. వేదికపై పార్టీ అగ్రనేతలు ఉండగానే పుదుచ్చేరి కాంగ్రెస్ నేతలు తమ కండబలం చూపించేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనం ఇస్తోంది.

Venkatesan
DMK Flag
Congress Leader
Puducherry

More Telugu News