ఏపీలో మరో 310 మందికి కరోనా పాజిటివ్... ఇద్దరి మృతి

  • గత 24 గంటల్లో 35,375 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 51 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • కరోనా నుంచి కోలుకున్న 114 మంది
  • యాక్టివ్ కేసుల సంఖ్య 2,382
ఏపీలో గడచిన 24 గంటల్లో 35,375 కరోనా పరీక్షలు నిర్వహించగా 310 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 51 కేసులు వెల్లడి కాగా, తూర్పు గోదావరిలో 43, విశాఖ జిల్లాలో 43 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 114 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో మరొకరు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 8,94,044 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,84,471 మంది కోలుకున్నారు. ఇంకా 2,382 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 7,191కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
New Cases
Deaths
Active Cases

More Telugu News