ఏపీలో మరో 1,063 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 59,198 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 211 కేసులు
  • అనంతపురం జిల్లాలో 10 మందికి పాజిటివ్
  • రాష్ట్రవ్యాప్తంగా 11 మంది మృతి
ఏపీ స్టేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ కరోనా రోజువారీ కేసుల బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 59,198 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,063 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 211 కొత్త కేసులు వెల్లడి కాగా, నెల్లూరు జిల్లాలో 198, పశ్చిమ గోదావరిలో 147, గుంటూరు జిల్లాలో 104, కృష్ణా జిల్లాలో 103 కేసులు గుర్తించారు. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 1,929 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 11 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,95,669కి చేరింది. 19,65,657 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులు కాగా, ఇంకా 16,341 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 13,671కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
New Cases
Deaths

More Telugu News