ఏపీలో మరో 503 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 32,846 కరోనా పరీక్షలు
  • అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 108 కొత్త కేసులు
  • విజయనగరం జిల్లాలో ఇద్దరికి పాజిటివ్
  • రాష్ట్రవ్యాప్తంగా 12 మంది మృతి
  • ఇంకా 6,932 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 32,846 కరోనా పరీక్షలు నిర్వహించగా, 503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 108 కొత్త కేసులు వెల్లడి కాగా, కృష్ణా జిల్లాలో 88, గుంటూరు జిల్లాలో 68 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఇద్దరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

అదే సమయంలో 817 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మరణించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే నలుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,268కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,58,065 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,36,865 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 6,932 మంది చికిత్స పొందుతున్నారు.

Andhra Pradesh
Corona Virus
Today Cases
Media Report

More Telugu News