ఏపీలో కొత్తగా 675 కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

  • రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురి మృతి
  • కరోనా నుంచి కోలుకున్న 2,414 మంది
  • ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 10,808
ఏపీలో గత 24 గంటల్లో 675 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 143 కేసులు వెలుగుచూశాయి. ఇదే సమయంలో మహమ్మారి కారణంగా ముగ్గురు మృతి చెందారు. మొత్తం 2,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 23,14,502కి పెరిగింది. వీరిలో 22,88,989 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,705 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,808 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News