తెలంగాణలో కొత్తగా 67 మందికి కరోనా పాజిటివ్

Corona positive for 67 new people in Telangana
  • గత 24 గంటల్లో 21,843 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 19 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 152 మంది
  • ఇంకా 865 మందికి చికిత్స
తెలంగాణలో  గడచిన 24 గంటల్లో 21,843 కరోనా పరీక్షలు నిర్వహించగా, 67 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 19 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 9 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 152 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో మరణాలేవీ సంభవించలేదు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,418 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,85,442 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 865 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు. 

.
Go Back to Shorts
Corona Virus
Telangana

More Telugu News