రాజపక్స మాదిరే మోదీ కూడా దేశం నుంచి పారిపోతారు: టీఎంసీ నేత ఇద్రిస్ అలీ

  • మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్న అలీ 
  • పాలనలో మోదీ ఫెయిల్ అయ్యారని వ్యాఖ్య 
  • దేశంలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతాయన్న అలీ 
ప్రధాని మోదీపై టీఎంసీ ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాదిరే మోదీకి కూడా అదే గతి పడుతుందని... ఆయన మాదిరే మోదీ కూడా దేశం వదిలి పారిపోతారని అన్నారు. మోదీ ప్రభుత్వం అన్ని విధాలా ఘోరంగా విఫలమయిందని విమర్శించారు. బీజేపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని చెప్పారు. పాలనలో మోదీ పూర్తిగా ఫెయిల్ అయ్యారని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు మరింత దిగజారుతాయని, ఆందోళన కరంగా మారుతాయని... అప్పుడు మోదీ కూడా రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోతారని చెప్పారు.

Narendra Modi
BJP
Idris Ali
TMC
Gotabaya Rajapaksa

More Telugu News