పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడతామన్నదే ముఖ్యం: ఇంగ్లండ్ తో సెమీస్ పై రోహిత్ శర్మ స్పందన

  • టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరిన భారత్
  • ఈ నెల 10న ఇంగ్లండ్ తో నాకౌట్ సమరం
  • ఇంగ్లండ్ తో పోరు సవాల్ వంటిదన్న రోహిత్ శర్మ
  • హోరాహోరీ పోరు తప్పదని వెల్లడి
ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుత ఆటతీరుతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లడం తెలిసిందే. సూపర్-12 దశలో ఐదు మ్యాచ్ లు ఆడిన భారత్ కేవలం ఒక్క మ్యాచ్ లోనే ఓటమిపాలైంది. మిగతా నాలుగు మ్యాచ్ ల్లో నెగ్గి గ్రూప్ లో అగ్రస్థానంలో నాకౌట్ దశకు చేరింది. 

ఈ నెల 10న జరిగే సెమీఫైనల్లో భారత జట్టు ఇంగ్లండ్ తో తలపడనుంది. దీనిపై టీమిండియా సారథి రోహిత్ శర్మ స్పందించాడు. ఇంగ్లండ్ తో పోరు ఓ సవాల్ వంటిదని పేర్కొన్నాడు. పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడతామన్నదే కీలకమని అభిప్రాయపడ్డాడు. సెమీస్ మ్యాచ్ జరిగే అడిలైడ్ ఓవల్ లో తాము ఇప్పటికే ఓ మ్యాచ్ ఆడామని, దాంతో ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉందని హిట్ మ్యాన్ తెలిపాడు. 

ఇటీవల కాలంలో ఇంగ్లండ్ రాణిస్తోందని, ఆ జట్టుతో తాము ఆడబోయే మ్యాచ్ లో హోరాహోరీ పోరు తప్పదని పేర్కొన్నారు. ఈ టోర్నీలో సెమీస్ ఎలా చేరామన్న విషయం తాము మర్చిపోలేదని, సెమీస్ లోనూ అదే తరహా దృక్పథంతో బరిలో దిగుతామని అన్నాడు. వ్యక్తులుగా తాము జట్టు కోసం ఏం చేయగలమో ఆలోచిస్తామని రోహిత్ శర్మ వివరించాడు.

Rohit Sharma
Team India
Semifinal
England
T20 World Cup

More Telugu News