నేను కాంగ్రెస్‌లో చేరడంతో ఆయనకు నిద్రపట్టడం లేదు: పొంగులేటి

  • సండ్ర వెంకటవీరయ్యపై మాజీ ఎంపీ నిప్పులు
  • సండ్ర కేసీఆర్ ను మించిన దొర అని విమర్శలు
  • 103 మంది సిట్టింగ్ లకు బీఫామ్ లు ఇచ్చే దమ్ముందా? అని సవాల్
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే సండ్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను మించిన దొర అని ధ్వజమెత్తారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సండ్రకు నిద్ర కూడా పట్టడం లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని, సండ్రను ఇంటికి పంపించడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ లో ఇప్పుడున్న 103 మంది ఎమ్మెల్యేలకు బీఫామ్ లు ఇచ్చే దమ్ముందా? అని ఆయన సవాల్ చేశారు.

Ponguleti Srinivas Reddy
BRS
Congress
Khammam District

More Telugu News