జగన్ ను బ్లాక్ మెయిల్ చేసి విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యాడు: లంకా దినకర్

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విజయసాయి ఫోన్ పగిలిందన్న లంకా దినకర్
  • నాసిరకం మద్యం తయారీలో మీ అల్లుడి పాత్ర లేదా? అని ప్రశ్న
  • విజయసాయి మళ్లీ దిగజారుడు భాష వాడుతున్నారని విమర్శ
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శలు గుప్పించారు. లిక్కర్ స్కామ్ లో మీ పాత్ర ఏమిటి? మీ అల్లుడు శరత్ చంద్రారెడ్డి పాత్ర ఏమిటి? అని ప్రశ్నించారు. ఫోన్లలో సమాచారం దొరికితే ఎక్కడ దొరికిపోతామో అని పగలగొట్టిన ఫోన్లు ఎవరివని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మీ ఫోన్ పగిలిందని... ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇంకేమి పగులుతాయో అని చెప్పారు. నాసిరకం మద్యం తయారీ వెనుక మీ అల్లుడి పాత్ర లేదా అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ బయటపడతాయనే భయంతో తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. 

ఈ మధ్య కాలంలో విజయసాయిరెడ్డి కొంచెం సైలెంట్ అయ్యారని... జగన్ ను బ్లాక్ మెయిల్ చేసి మళ్లీ యాక్టివ్ అయ్యాడని విమర్శించారు. ఈ మధ్య కాలంలో విజయసాయిరెడ్డి భాష సంస్కారవంతంగా మారిందని... ఇప్పుడు మళ్లీ దిగజారుడు భాషను వాడుతున్నారని మండిపడ్డారు. పురందేశ్వరిని విజయసాయిరెడ్డి టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై లంకా దినకర్ విమర్శలు గుప్పించారు. 


Lanka Dinakar
BJP
Vijayasai Reddy
Jagan
YSRCP
Liquor

More Telugu News