పురంధేశ్వరి ఏ ఎండకా గొడుగు పట్టే రకం.. విజయసాయి రెడ్డి ఫైర్

  • టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారని విమర్శ
  • తండ్రిని అవమానించిన కాంగ్రెస్ లో చేరి పదవులు అనుభవించిందని మండిపాటు
  • ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేసిన మహా గొప్ప మహిళ అంటూ వ్యంగ్యం
ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో అనధికారిక గౌరవ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొనసాగుతోందని వైసీపీ లీడర్ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఆమె ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమంటూ మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో అంటకాగారని, చంద్రబాబు పార్టీ నుంచి గెంటేస్తే కాంగ్రెస్ లో చేరారని ఆరోపించారు.

తన తండ్రిని అవమానించిన పార్టీ అంటూ అప్పటి వరకూ విమర్శించిన అదే కాంగ్రెస్ లో చేరి, నిస్సిగ్గుగా పదవులు చేపట్టారని అన్నారు. తండ్రిని అవమానించి, ఆ పునాదులపై ఏర్పాటైన టీడీపీలో అధికారం ఉన్నంతకాలం ఉన్న నీతిలేని చరిత్ర ఆమెదని తీవ్రంగా విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేసిన మహా గొప్ప మహిళ అని పురంధేశ్వరిపై మండిపడ్డారు.

Ysrcp
Vijayasai Reddy
Daggubati Purandeswari
BJP
Twitter

More Telugu News