సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం

  • మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు చంద్రబాబు 
  • ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సామాన్య భక్తుడిలా క్యూలైన్‌లో వెళ్లిన సీఎం
  • శ్రీవారి అన్నదాన ట్రస్టుకు రూ.44 లక్షల విరాళం అందించిన సీఎం కుటుంబం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ, ఆయన ఎలాంటి ప్రోటోకాల్ తీసుకోకుండా సామాన్య భక్తుడిలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచే స్వామివారి దర్శనానికి వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని చంద్రబాబు కుటుంబసమేతంగా తిరుమల వచ్చారు. ఆయన వెంట అర్ధాంగి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. ముఖ్యమంత్రిగా మహాద్వారం గుండా నేరుగా ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ, చంద్రబాబు తన పాత పద్ధతినే అనుసరించి సాధారణ క్యూలైన్‌లోనే వెళ్లారు.

ఏటా దేవాన్ష్ పుట్టినరోజున అన్నదానానికి విరాళం ఇవ్వడం ఆనవాయితీ
శ్రీవారి దర్శనం అనంతరం చంద్రబాబు కుటుంబ సభ్యులు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్‌లో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. ఈ అన్నదానం కోసం ఒక రోజుకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను ఆయన కుటుంబం ఇప్పటికే శ్రీవారి అన్నదాన ట్రస్టుకు విరాళంగా అందించింది. చంద్రబాబు నాయుడు ఈ ట్రస్టుకు విరాళం ఇవ్వడం ఇది 12వ సారి కావడం గమనార్హం. ఈ పర్యటనలో భక్తి, సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తిరుమలలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Chandrababu
Tirumala
TTD
Nara Devaansh
Andhra Pradesh CM
Tirumala Temple
Lord Venkateswara
Bhuvaneswari
Nara Lokesh
Brahmani

More Telugu News