సుస్మిత సేన్తో బంధంపై ఏళ్ల తర్వాత స్పందించిన లలిత్ మోదీ.. సంచలన నిజాలు వెల్లడి
- నటి సుస్మితా సేన్పై వచ్చిన 'గోల్డ్ డిగ్గర్' ఆరోపణలను ఖండించిన లలిత్ మోదీ
- తమ బంధంలో ఖర్చులన్నీ ఆమే చూసుకుందని.. తాను 'కెప్ట్ బాయ్ఫ్రెండ్'లా ఉన్నానని వెల్లడి
- 2022లో తమ ప్రేమాయణం బయటపడినప్పుడు జరిగిన ట్రోలింగ్పై ఏళ్ల తర్వాత స్పందన
- సుస్మిత ఆర్థికంగా స్వతంత్రురాలని, ఆమెకు సొంతంగా వజ్రాల వ్యాపారం ఉందని ప్రశంస
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, విశ్వసుందరి సుస్మితా సేన్ మధ్య 2022లో నడిచిన ప్రేమాయణం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సుస్మితను 'గోల్డ్ డిగ్గర్' (డబ్బు కోసం ఆశపడే వ్యక్తి) అంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శించారు. ఈ ఆరోపణలపై లలిత్ మోదీ ఏళ్ల తర్వాత స్పందించారు. సుస్మితపై వచ్చిన విమర్శలన్నీ అవాస్తవమని, తమ బంధంలో ఖర్చులన్నీ ఆమే భరించేదని స్పష్టం చేశారు.
ఇటీవల 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోదీ ఈ విషయాలను పంచుకున్నారు. "ఆమెను గోల్డ్ డిగ్గర్ అనడం చాలా తప్పు. వాస్తవానికి మా ప్రయాణాల్లో ఖర్చులన్నీ ఆమే చూసుకునేది. చెప్పాలంటే.. నేనొక కెప్ట్ బాయ్ఫ్రెండ్లా (ఆమె పోషణలో ఉన్న ప్రియుడిలా) ఉండేవాడిని" అని మోదీ అన్నారు. తమలో ఎవరైనా డిగ్గర్ ఉంటే, అది వజ్రాల కోసం వెతికిన తానేనని ఆయన చమత్కరించారు. సుస్మిత తన కంటే ముందే ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఆమెకు సొంతంగా వజ్రాల వ్యాపారం కూడా ఉందని తెలిపారు.
2022 జులైలో లలిత్ మోదీ.. సుస్మితతో కలిసి విహారయాత్రల్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఆమెను తన 'బెటర్ హాఫ్' అని ప్రకటించారు. దీంతో సుస్మితపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. లలిత్ మోదీ సంపద కోసమే ఆమె బంధం కొనసాగిస్తోందని ఆరోపణలు గుప్పించారు.
అయితే ఆనాటి ట్రోలింగ్పై సుస్మిత కూడా ఎంతో హుందాగా స్పందించారు. "నేను బంగారం కంటే లోతుగా తవ్వుతాను. నాకు ఎప్పటినుంచో వజ్రాలంటేనే ఇష్టం. వాటిని ఇప్పటికీ నేనే స్వయంగా కొనుక్కుంటాను" అని ఇన్స్టాగ్రామ్లో బదులిచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయినప్పటికీ, లలిత్ మోదీ చేసిన తాజా వ్యాఖ్యలతో ఈ పాత వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది.
ఇటీవల 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోదీ ఈ విషయాలను పంచుకున్నారు. "ఆమెను గోల్డ్ డిగ్గర్ అనడం చాలా తప్పు. వాస్తవానికి మా ప్రయాణాల్లో ఖర్చులన్నీ ఆమే చూసుకునేది. చెప్పాలంటే.. నేనొక కెప్ట్ బాయ్ఫ్రెండ్లా (ఆమె పోషణలో ఉన్న ప్రియుడిలా) ఉండేవాడిని" అని మోదీ అన్నారు. తమలో ఎవరైనా డిగ్గర్ ఉంటే, అది వజ్రాల కోసం వెతికిన తానేనని ఆయన చమత్కరించారు. సుస్మిత తన కంటే ముందే ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఆమెకు సొంతంగా వజ్రాల వ్యాపారం కూడా ఉందని తెలిపారు.
2022 జులైలో లలిత్ మోదీ.. సుస్మితతో కలిసి విహారయాత్రల్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఆమెను తన 'బెటర్ హాఫ్' అని ప్రకటించారు. దీంతో సుస్మితపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. లలిత్ మోదీ సంపద కోసమే ఆమె బంధం కొనసాగిస్తోందని ఆరోపణలు గుప్పించారు.
అయితే ఆనాటి ట్రోలింగ్పై సుస్మిత కూడా ఎంతో హుందాగా స్పందించారు. "నేను బంగారం కంటే లోతుగా తవ్వుతాను. నాకు ఎప్పటినుంచో వజ్రాలంటేనే ఇష్టం. వాటిని ఇప్పటికీ నేనే స్వయంగా కొనుక్కుంటాను" అని ఇన్స్టాగ్రామ్లో బదులిచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయినప్పటికీ, లలిత్ మోదీ చేసిన తాజా వ్యాఖ్యలతో ఈ పాత వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది.