బ్రిటన్లో భారత యువకుడి నిర్వాకం.. మైనర్తో అసభ్యకర చాటింగ్.. చివరికి!
- యూకేలో మైనర్ను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించిన భారత యువకుడు
- ప్రావ్నా భట్ అనే 27 ఏళ్ల వ్యక్తిని పట్టుకున్న స్థానిక విజిలెంట్ గ్రూప్
- మైనర్ అని తెలిసీ అసభ్య మెసేజ్లు, వీడియోలు పంపినట్లు అంగీకారం
- ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
యునైటెడ్ కింగ్డమ్లో (యూకే) ఓ భారత యువకుడు మైనర్ను లైంగికంగా లోబరుచుకునేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. స్థానికంగా తమను తాము 'బ్రిటిష్ పేట్రియాట్స్' అని చెప్పుకునే విజిలెంట్ గ్రూప్ సభ్యులు అతడిని పట్టుకుని నిలదీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే... ప్రావ్నా భట్ (27) అనే ఈ యువకుడు మూడేళ్ల క్రితం విద్యార్థి వీసాపై యూకేకి వచ్చాడు. లీడ్స్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి, ప్రస్తుతం పోస్ట్-స్టడీ వీసాపై అక్కడే నివసిస్తున్నాడు. ఇతడు ఆన్లైన్లో 14 ఏళ్ల బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి.
బాలిక వయసు 14 ఏళ్లని తెలిసినప్పటికీ, తాను ఆమెకు లైంగిక ఉద్దేశాలతో కూడిన మెసేజ్లు పంపినట్లు భట్ అంగీకరించాడు. ఒక మెసేజ్లో 'ఈ పనికి నేను జైలుకు వెళతాను' అని రాసి, నవ్వుతున్న ఎమోజీలను జతచేశాడు. తాను చేస్తున్నది తీవ్రమైన నేరమని తెలిసినా, అతను ఆగలేదు. తన అశ్లీల వీడియోను బాలికకు పంపడమే కాకుండా, తన గదికి దొంగచాటుగా రావాలని కోరాడు. హోటల్లో ఇద్దరూ గడిపేందుకు గది బుక్ చేయడానికి డబ్బులు ఇవ్వాలని కూడా బాలికను అడిగినట్లు తెలిసింది.
బాలిక కోసం ఎదురుచూస్తున్న సమయంలో విజిలెంట్ గ్రూప్ సభ్యులు అతడిని పట్టుకున్నారు. పట్టుబడిన తర్వాత భట్ తన తప్పును ఒప్పుకుని, క్షమించమని వేడుకున్నాడు. "నేను ఇలా చేయడం ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి. దయచేసి నాకు చివరి అవకాశం ఇవ్వండి. పోలీసులకు ఫోన్ చేయవద్దు" అని ప్రాధేయపడ్డాడు.
యూకేలో ఆన్లైన్ గ్రూమింగ్ కేసుల్లో భారతీయ యువకులు పట్టుబడటం ఇటీవల ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలోనూ కోవెంట్రీ నగరంలో గురీత్ జీతేష్ అనే మరో భారత యువకుడిని ఇలాంటి ఆరోపణలతోనే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. యూకేకి వచ్చిన మూడు నెలలకే అతడు ఈ నేరానికి పాల్పడినట్లు తేలింది.
వివరాల్లోకి వెళితే... ప్రావ్నా భట్ (27) అనే ఈ యువకుడు మూడేళ్ల క్రితం విద్యార్థి వీసాపై యూకేకి వచ్చాడు. లీడ్స్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి, ప్రస్తుతం పోస్ట్-స్టడీ వీసాపై అక్కడే నివసిస్తున్నాడు. ఇతడు ఆన్లైన్లో 14 ఏళ్ల బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి.
బాలిక వయసు 14 ఏళ్లని తెలిసినప్పటికీ, తాను ఆమెకు లైంగిక ఉద్దేశాలతో కూడిన మెసేజ్లు పంపినట్లు భట్ అంగీకరించాడు. ఒక మెసేజ్లో 'ఈ పనికి నేను జైలుకు వెళతాను' అని రాసి, నవ్వుతున్న ఎమోజీలను జతచేశాడు. తాను చేస్తున్నది తీవ్రమైన నేరమని తెలిసినా, అతను ఆగలేదు. తన అశ్లీల వీడియోను బాలికకు పంపడమే కాకుండా, తన గదికి దొంగచాటుగా రావాలని కోరాడు. హోటల్లో ఇద్దరూ గడిపేందుకు గది బుక్ చేయడానికి డబ్బులు ఇవ్వాలని కూడా బాలికను అడిగినట్లు తెలిసింది.
బాలిక కోసం ఎదురుచూస్తున్న సమయంలో విజిలెంట్ గ్రూప్ సభ్యులు అతడిని పట్టుకున్నారు. పట్టుబడిన తర్వాత భట్ తన తప్పును ఒప్పుకుని, క్షమించమని వేడుకున్నాడు. "నేను ఇలా చేయడం ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి. దయచేసి నాకు చివరి అవకాశం ఇవ్వండి. పోలీసులకు ఫోన్ చేయవద్దు" అని ప్రాధేయపడ్డాడు.
యూకేలో ఆన్లైన్ గ్రూమింగ్ కేసుల్లో భారతీయ యువకులు పట్టుబడటం ఇటీవల ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలోనూ కోవెంట్రీ నగరంలో గురీత్ జీతేష్ అనే మరో భారత యువకుడిని ఇలాంటి ఆరోపణలతోనే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. యూకేకి వచ్చిన మూడు నెలలకే అతడు ఈ నేరానికి పాల్పడినట్లు తేలింది.