వారణాసి విలన్ లగ్జరీ కార్ల కలెక్షన్.. గ్యారేజీలో లంబోర్ఘిని, రేంజ్ రోవర్
- గ్యారేజీలో ఖరీదైన కార్లు
- ముంబై పాలి హిల్లో డూప్లెక్స్ కొన్న పృథ్వీరాజ్ సుకుమారన్
- విలువ సుమారు రూ. 30.6 కోట్లుగా అంచనా
- సినిమాకు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న నటుడు
- విజయవంతమైన కెరీర్తో రియల్ ఎస్టేట్లో భారీ పెట్టుబడులు
మలయాళ స్టార్ హీరో, పాన్ ఇండియా నటుడిగా ఎదుగుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్కు విలాసవంతమైన కార్లంటే ఎంతో మక్కువ. ఆయన గ్యారేజీలో ఇప్పటికే పలు ఖరీదైన కార్లు ఉన్నాయి. సుమారు రూ. 4.37 కోట్ల విలువైన లంబోర్ఘిని ఉరుస్, రూ. 3 కోట్ల వరకు ఉండే రేంజ్ రోవర్ వోగ్ వంటి లగ్జరీ వాహనాలు ఆయన కార్ల కలెక్షన్లో భాగంగా ఉన్నాయి. తాజాగా ఈ నటుడు తన ఆస్తుల జాబితాలో మరో భారీ కొనుగోలును చేర్చారు.
ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఒకటైన బాంద్రాలోని పాలీ హిల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక విలాసవంతమైన డూప్లెక్స్ను కొనుగోలు చేశారు. తన నిర్మాణ సంస్థ పేరు మీద ఈ ఆస్తిని రిజిస్టర్ చేయించారు. 2,971 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్ కోసం ఆయన రూ. 30.6 కోట్లు వెచ్చించినట్టు సమాచారం. ఈ డూప్లెక్స్తో పాటు నాలుగు కార్లు పార్క్ చేసుకునేందుకు వీలుగా విశాలమైన పార్కింగ్ స్థలం కూడా ఉంది. ఈ డీల్ కోసం ఆయన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల కింద అదనంగా రూ. 1.84 కోట్లు చెల్లించారు.
ప్రస్తుతం పృథ్వీరాజ్ ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మలయాళంలో అగ్ర నటుడిగా కొనసాగుతూనే, పాన్ ఇండియా స్థాయిలోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటూ కెరీర్లో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన 'ఐ, నోబడీ', 'ఖలీఫా', 'వారణాసి' వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఒకటైన బాంద్రాలోని పాలీ హిల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక విలాసవంతమైన డూప్లెక్స్ను కొనుగోలు చేశారు. తన నిర్మాణ సంస్థ పేరు మీద ఈ ఆస్తిని రిజిస్టర్ చేయించారు. 2,971 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్ కోసం ఆయన రూ. 30.6 కోట్లు వెచ్చించినట్టు సమాచారం. ఈ డూప్లెక్స్తో పాటు నాలుగు కార్లు పార్క్ చేసుకునేందుకు వీలుగా విశాలమైన పార్కింగ్ స్థలం కూడా ఉంది. ఈ డీల్ కోసం ఆయన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల కింద అదనంగా రూ. 1.84 కోట్లు చెల్లించారు.
ప్రస్తుతం పృథ్వీరాజ్ ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మలయాళంలో అగ్ర నటుడిగా కొనసాగుతూనే, పాన్ ఇండియా స్థాయిలోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటూ కెరీర్లో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన 'ఐ, నోబడీ', 'ఖలీఫా', 'వారణాసి' వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.