రామ్ చరణ్ మాస్ కంబ్యాక్.. 'పెద్ది' చిత్రానికి తొలిరోజే 100 కోట్లకు పైగా వసూళ్లు!
- 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ కు 'పెద్ది' రూపంలో భారీ కమర్షియల్ హిట్
- తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 112.49 కోట్లు వసూలు చేసిన పెద్ది
- 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన 11వ తెలుగు చిత్రంగా రికార్డ్
- చరణ్ సోలో కెరీర్లోనే ఇదే అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్
- వారాంతంలో రూ. 250 కోట్ల వసూళ్లు దాటే అవకాశం ఉందని అంచనా
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా మరోసారి చాటారు. 'ఆర్ఆర్ఆర్' (2022) తర్వాత సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు 'పెద్ది' రూపంలో భారీ విందు అందించారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 112.49 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ ఘనత సాధించిన 11వ తెలుగు చిత్రంగా 'పెద్ది' రికార్డు సృష్టించింది. రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రాల్లో కెరీర్లోనే ఇది అత్యుత్తమ ఓపెనింగ్గా నిలిచి రికార్డు సృష్టించింది.
ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందినా, ఆ తర్వాత వచ్చిన 'గేమ్ ఛేంజర్' (2025) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ నేపథ్యంలో 'పెద్ది' విజయం రామ్ చరణ్ కెరీర్కు, తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో కీలకంగా మారింది. ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్ 'సాక్నిల్క్' వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 'పెద్ది' సినిమా తొలిరోజు భారతదేశంలో రూ.69.50 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. ఇందులో బుధవారం రాత్రి ప్రదర్శించిన పెయిడ్ ప్రీమియర్ల ద్వారా వచ్చిన రూ.18.50 కోట్లు కూడా ఉన్నాయి. దేశీయంగా రూ.82.49 కోట్ల గ్రాస్, ఓవర్సీస్లో సుమారు రూ.30 కోట్లకు పైగా వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు గ్రాస్ రూ.112 కోట్లు దాటింది. ఇక ప్రాంతాల వారీగా గ్రాస్ వివరాలను గమనిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా రూ.48.00 కోట్లు, కర్ణాటకలో రూ.5.75 కోట్ల గ్రాస్ వసూలైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కొన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ, థియేటర్ల వద్ద అభిమానుల సందడితో కలెక్షన్లపై ఆ ప్రభావం కనిపించడం లేదు. అధిక టికెట్ ధరలు ఉన్నప్పటికీ, 'గేమ్ ఛేంజర్' కంటే మెరుగైన ఆదరణ లభిస్తోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, మొదటి వారాంతం ముగిసేనాటికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 200 నుంచి 250 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, శివ రాజ్కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు కీలక పాత్రలు పోషించారు.
ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందినా, ఆ తర్వాత వచ్చిన 'గేమ్ ఛేంజర్' (2025) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ నేపథ్యంలో 'పెద్ది' విజయం రామ్ చరణ్ కెరీర్కు, తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో కీలకంగా మారింది. ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్ 'సాక్నిల్క్' వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 'పెద్ది' సినిమా తొలిరోజు భారతదేశంలో రూ.69.50 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. ఇందులో బుధవారం రాత్రి ప్రదర్శించిన పెయిడ్ ప్రీమియర్ల ద్వారా వచ్చిన రూ.18.50 కోట్లు కూడా ఉన్నాయి. దేశీయంగా రూ.82.49 కోట్ల గ్రాస్, ఓవర్సీస్లో సుమారు రూ.30 కోట్లకు పైగా వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు గ్రాస్ రూ.112 కోట్లు దాటింది. ఇక ప్రాంతాల వారీగా గ్రాస్ వివరాలను గమనిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా రూ.48.00 కోట్లు, కర్ణాటకలో రూ.5.75 కోట్ల గ్రాస్ వసూలైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కొన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ, థియేటర్ల వద్ద అభిమానుల సందడితో కలెక్షన్లపై ఆ ప్రభావం కనిపించడం లేదు. అధిక టికెట్ ధరలు ఉన్నప్పటికీ, 'గేమ్ ఛేంజర్' కంటే మెరుగైన ఆదరణ లభిస్తోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, మొదటి వారాంతం ముగిసేనాటికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 200 నుంచి 250 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, శివ రాజ్కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు కీలక పాత్రలు పోషించారు.